గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరి యువకుల అరెస్టు
లక్ష విలువైన గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

viswatelangana.com
జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపీఎస్ అదేశాల మేరకు, మెట్ పల్లి డీఏస్పీ ఏ. రాములు పర్యవేక్షణలో, కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు అద్వర్యంలో మేడిపల్లి ఎస్.ఐ జి. శ్యామ్ రాజ్ తన సిబ్బంది యుక్తంగా ఇద్దరు గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకున్నారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన వేలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన మేట్ పల్లి డీఏస్పీ రాములు…. మేడిపల్లి ఎస్.ఐ జి. శ్యామ్ రాజ్ వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఇద్దరు యువకులు మేడిపల్లి గ్రామ శివారులోని ఎస్.ఆర్.ఎస్.పి. కెనాల్ కట్లకుంట రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నరానే పక్క సమాచారం తెలియగానే వెంటనే ఎస్.ఐ శ్యామ్ రాజ్ సిబ్బందితో మేడిపల్లి గ్రామ శివారులోని ఎస్.ఆర్.ఎస్.పి. కెనాల్ వద్ద కట్లకుంట రోడ్డుకు చేరుకునే సరికి ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో యువకులు గంజాయి అమ్ముతున్నట్లు తేలింది వారి వివరాలు గోల్కొండ హరీష్, మేట్ పల్లి పట్టణం అలాగే రెండవ వ్యక్తీ బొల్లంపల్లి అభిషేక్ అలియాస్ విష్ణువర్ధన్ మెట్ పల్లి పట్టణం, ఇద్దరి వద్ద నుండి సుమారు 2 కిలోల 200 గ్రాముల గంజాయి అలాగే 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి గంజాయి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. వీరు ఒరిస్సాకు చెందిన దీపక్ అలియాస్ సూరజ్ అనే వ్యక్తి వద్ద నుండి తక్కువ ధరకు గంజాయి కోనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్ లు గా చేసి జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల పరిసర ప్రాంతాలకు అలాగే చుట్టుపక్కల గ్రామాలలో అధిక ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. వీరిపై గతంలో మెట్ పల్లి, మేడిపల్లి పోలిస్ స్టేషన్ లో గంజాయి కేసులు నమోదు అయినాయి. నిందితులపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు అలాగే ఈ కేసులో పరారిలో ఉన్న మరొక నిందితుడైన దీపక్ అలియాస్ సూరజ్ ను త్వరలో పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తామని మెట్ పల్లి డీఏస్పీ ఏ.రాములు తెలిపారు. అలాగే నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి ఎస్.ఐ జి. శ్యామ్ రాజ్ అలాగే సిబ్బంది అనిల్ కుమార్, చంద్ర శేఖర్, రాజశేఖర్, మహేశ్వర్, భగవాన్ లను మెట్ పల్లి డీఏస్పీ ఏ. రాములు నగదు బహుమతితో అభినందిచారు. యువత ఎవరు కూడా మత్తు పదార్థాలు, గంజాయి సేవించ రాదని, ఓక వేళ ఇట్టి చట్ట వ్యతిరేక పనులు చేస్తే వారిపైన కటిన చర్యలు తీసుకుంటామని డీఏస్పీ తెలిపారు.



