కథలాపూర్
దోమల నిర్మూల తోనే డెంగ్యూ నివారణ

viswatelangana.com
May 16th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని అంబరిపేట గ్రామంలో దోమల నిర్మూలన తోనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని మెడికల్ ఆఫీసర్ అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు డెంగ్యూ వ్యాధి రాకుండా పరిసరాలను ఇంటి ఆరుబయట నీరు నిలవకుండా చూసుకోవాలని చెత్తను ఆరు బయట పారవేయకుండా కుండీలలో వేయాలని సూచించారు పాత సామాన్లు కూలర్లు ఫ్రిజ్లలో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని మురుగు గుంటలలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ డాక్టర్ రచన సూపర్వైజర్ హెల్త్ అసిస్టెంట్నర్సింగ్ ఆఫీసర్స్ ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు



