భీమారం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
October 20th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2007-2008 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులు 15 సంవత్సరాల తరువాత అందరూ కలవడంతో ఎంతో సంతోషం వ్యక్తం పరుస్తూ ఆనాడు చదువుకున్న సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని చదువు చెప్పిన గురువులను మరువకుండా వారి జ్ఞాపకాలను యాదిలో పెట్టుకొని ఎంతో సంస్కారాన్ని నేర్పారని వారి ప్రేరణ మాకు ఎప్పుడు ఉంటుందని పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా గడిపారు.



