భీమారంమేడిపల్లి

పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న కారోబార్ విధుల నుండి తొలగింపు

viswatelangana.com

May 13th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయగా ఉద్రిక్తత వాతావరణానికి తెర పడింది. వివరాల్లోనికి వెళితే ఆ గ్రామ కారోబార్ పోలింగ్ కేంద్రం వద్ద ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఇతర పార్టీల నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయంపై ఎంపీడీవో చిరంజీవిని వివరణ కోరగా ఆ గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కి అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ కార్యదర్శి ఆదేశాలనే సారాంశం. కారోబార్ కి పోలింగ్ కేంద్ర బాధ్యతలు అప్పజెప్పడం తో సమస్య ఏర్పడిందని, తక్షణమే కారోబార్ ని విధులనుండి తొలగిస్తున్నారని అధికారులు తెలిపారు

Related Articles

Back to top button