జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లింగాపూర్ గ్రామంలో అడవి పంది మాంసాన్ని విక్రయిస్తున్నాడన్న సమాచారంతో గ్రామానికి వెళ్లి తనిఖీలు చేయగా దండుగుల నరసయ్య వద్ద అడవి పంది మాంసం దొరకగా పట్టుకొని కేసు బుక్ చేసి కోర్టు కు తరలించారు. ఈ కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ టీ. భూమేష్, సెక్షన్ ఆఫీసర్ మల్లయ్య, బీట్ ఆఫీసర్ పాష తదితరులు పాల్గొన్నారు.