అమృత 2.0 లో భాగంగా 41.50 కోట్ల నిధుల మంజూరు…
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా తాళ్లచెరువు నింపేందుకు కృషి...

viswatelangana.com
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా అమృత్ 2.0 లో భాగంగా కోరుట్ల మున్సిపాలిటీకి 41. 50 కోట్లు మధ్యలో కావడం జరిగిందని కోరుట్ల పట్టణ విలీన గ్రామమైన ఎకిన్ పూర్ పట్టణ శివారులో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పైపులైన్ ద్వారా తాళ్లచెరువు లో నీళ్ళు నింపడం కోసం ఆర్డీవో మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తుందని అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎండాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహం తీర్చడం కోసం అమృత్ 2.0 లో భాగంగా కోట్ల రూపాయల నీరు మంజూరు చేయడం జరిగిందని దీనిలో భాగంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా తాళ్లచెరువును నింపడం కోసం రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించడం జరిగిందని 33 వార్డులకు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ప్రత్యేక నిధుల ద్వారా 33 బోర్లు మంజూరు చేయడం జరిగిందని వాటిని త్వరలోనే వేసేలా కృషి చేస్తామన్నారు.అలాగే తాళ్లచెరువు కంచేరకుంట మద్దుల చెరువు లలో త్వరలోనే పూడిక తీయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తో పాటు కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జీవాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ మున్సిపల్ డిఈ ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ ఏఈ కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్ నాయకులు అన్నం అనిల్ మచ్చ కవిత మ్యాకల నర్సయ్య,ఎంబేరి సత్యనారాయణ పుప్పాల ప్రభాకర్ శీలం వేణుగోపాల్ సంఘ లింగం జిందం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు



