మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఆరవ తరగతి చదువుతున్న అనిరుద్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఏమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు హుటాహుటిన జగిత్యాల ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు వీరి వెంట కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, అంజిరెడ్డి, అజయ్, విజయ్, సంజీవ్ తదితరులు ఉన్నారు.