viswatelangana.com
Date of Publish : 22 March 2024, 3:01 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అన్ని రంగాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా

వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ భీమరం మండల కేంద్రంలో గ్రామ శాఖ, మండల చుట్టుపక్క గ్రామాల నాయకుల కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్ర ప్రజలు అలాగే భీమవరం మండలం కేంద్రంలోని పలు సమస్యలను స్థానిక నాయకులుఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వాటిని వీలైనంత తొందరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా నని ముఖ్యంగా వరద కాలువ ద్వారా పండుతున్న పంట పొలాలకు నీరు విడుదల చేసేలా అధికారులతో మాట్లాడి పంటలకు సరిపడే నీళ్లు ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటను తను ఎప్పటికీ తప్పని మీ అందరి సహాయ సహకారాలతో 14 సంవత్సరాల తర్వాత నాకు ఈ అధికారం దక్కిందని దానిని మీ అందరితో కలిసికట్టుగా ఉండి అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వ అండదండలతో మరింత అభివృద్ధి పథంలో వేములవాడను అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకెళ్తానని మాట్లాడారు.ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి మేడిపల్లి భీమరం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, రైతులు పలు కులాల సంఘాల అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Change News Type