viswatelangana.com
Date of Publish : 24 May 2024, 5:28 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అమ్మకు సారె మనసారా ఒడి బియ్యం

వాసవి వనిత క్లబ్, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమ్మకు సారే మనసారా ఓడిబియ్యం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున (మూడవ నెల) చైతన్యపురిలో గల మహాశక్తి ఆలయంలో సరస్వతి అమ్మవారికి పసుపు కుంకుమ సారెచీరెలు. పూలు పండ్లు మొదలగు మొదలగునవి ఘనంగా సమర్పించడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల విజయ, వాసవి క్లబ్ వనిత కరీంనగర్ అధ్యక్షురాలు చందా విజయలక్ష్మి సెక్రటరీ పద్మావతి ట్రెజరర్ అనురాధ సీనియర్ సభ్యులు తోటకు కృష్ణకుమారి మంచాల తార, ఆకిన పెళ్లి శివజ్యోతి, మాడిశెట్టి ఉమా స్వరూప, ఇందిరా, ఉమా శోభ, మాధవి, లక్ష్మీ మరియు 50 మంది వనిత సభ్యులు పాల్గొన్నారు.

Change News Type