కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలోని శ్రీ రామాలయం గుట్టపై ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. శ్రీ గండి హనుమాన్ అర్చకులు మాధవాచారి, వినోద్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విగ్రహ దాత శ్రీగద్దె నరహరి, రామాలయ కమిటీ సభ్యులు హనుమాన్ దీక్ష పరులు తదితరులు పాల్గొన్నారు.