viswatelangana.com
Date of Publish : 29 March 2025, 4:39 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆర్థిక సహాయం అందజేత

చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా శనివారం దుబాయ్ ఫోర్స్ 10 కంపెనీ గ్రూపు సభ్యులు కలిసి జమ చేసిన రూ.10,500 లను రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన తోకల రవీందర్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దుబాయిలో మహేందర్ మేము ఓకే కంపెనీలో పనిచేసే వారమని, దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని, వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టాల్లో ఉన్న దుబాయ్ ఫోర్స్ 10 కంపెనీ గ్రూపు సభ్యుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు.

Change News Type