కోరుట్ల
ఆర్బిఎస్కె ఆధ్వర్యంలో స్క్రీనింగ్ పరీక్షలు

viswatelangana.com
March 11th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆర్బిఎస్కె రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం ఆద్వర్యములో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కంటి లోపాలు ఉన్నవారికి కంటి అద్దాలు జిల్లా వైద్య నిపుణులు సిఫారసుల మేరకు అద్దాలు కోరుట్ల మున్సిపల్ కమీషనర్ రామకృష్ణ అందించారు. ఈ కార్యక్రమంలో డా. రాధారాణి, డా. సమీనా తాబసుమ్, డా. గంగా మోహన్, ఐలాపూర్ వైద్య పర్యవేక్షకుల ధనుంజయ్, ఫార్మాసిస్టు భార్గవి పాల్గొన్నట్లు ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



