viswatelangana.com
Date of Publish : 02 May 2025, 1:08 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆర్మీ జవాన్ కు ఘన స్వాగతం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతి పూర్ గ్రామానికి చెందిన నూకల మల్లయ్య భారతీయ ఆర్మీలో 17 సంవత్సరాలు విధులు నిర్వహించి దేశ రక్షణలో తన వంతు భాగస్వామ్యమై తన స్వగ్రామం భూపతి పూర్ కు రాగ ఆయన మిత్రులు మల్లయ్యకు ఘన స్వాగతం పలికారు. పుష్ప గుచ్చా న్ని అందజేసి పూల మాలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మిత్రులు, గ్రామస్తులు మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేని వేణు, ఎంపీటీసీ మహేశ్వరరావు, తుమ్మనపల్లి విజయ్, దేవేందర్ రెడ్డి, జిత్తు, కామని లక్ష్మణ్ , ఏనుగు రాజారెడ్డి, రాంప్రసాద్, బొడ్డుపెల్లి విజయ్, మోతే అంజయ్య, బొల్లె తేజ , మరియు గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.

Change News Type