జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని వాసవి గార్డెన్స్ లో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం జరిగింది. అద్యక్షులుగా కూరగాయల రవి, ప్రధానకార్యదర్శిగా గరిపెల్లి శ్రీనివాస్, కోశాధికారిగా పల్లెర్ల పవన్ కుమార్ లతో పాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రవి మాట్లాడుతూ కార్యవర్గ సహకారంతో సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.