రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల జగిత్యాల వారి ఆధ్వర్యంలో పోరు మల్ల గ్రామంలో గ్రామపంచాయతీ పాఠశాల పరిసర ప్రాంతంలో శ్రమదానం చేయడం జరిగింది. తదనంతరం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థులు ఉద్దేశించి వాలంటీర్లతో వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనది అని దేశంలో చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటిదని విద్యార్థులుదేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జే రాకేష్ ఎండి అప్సర్ వాలంటీర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.