viswatelangana.com
Date of Publish : 22 March 2025, 7:49 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఇఫ్తార్ విందులో పాల్గొన్న జువ్వాడి నర్సింగరావు

కోరుట్ల పట్టణ ఐబి గెస్ట్ హౌజ్ ఎదురుగా గల ఈద్గా మసీదులో శనివారం జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు వసీం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇట్టి ఇఫ్తార్ విందులో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండాలని కలసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చునన్నారు. ఈకార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, ఎలిశెట్టి భూమారెడ్డి, ఏఆర్ అక్బర్, ఎంబేరి సత్యనారాయణ, చిలువేరి విజయ్, మాజీ కౌన్సిలర్ ఖయ్యుమ్, రజోజు భూమయ్య, పసుల కృష్ణప్రసాద్, చిట్యాల లక్ష్మీనారాయణ, వాసం అజయ్, జెట్టి లక్ష్మణ్, అమ్ముల రాహుల్, నిఖిల్, విష్ణు, కాశిరెడ్డి, మిట్టపెల్లి భూమేష్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Change News Type