కొడిమ్యాల

ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ

viswatelangana.com

June 8th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలైన తమను గుర్తించి ఇళ్ళు నిర్మించి ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ బుచ్చయ్య, మాజీ సర్పంచ్ మ్యాకల లత్ మల్లేశం, మాజీ వార్డు సభ్యులు దారం రత్నాకర్ రెడ్డి. అబ్రహం. గట్ల మల్లారెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button