viswatelangana.com
Date of Publish : 27 September 2024, 5:13 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఇస్లాంపూర కాలనీలో గ్యాస్ సబ్సిడీ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆద్వర్యంలో మెట్ పల్లి పట్టణంలోని ఇస్లాంపుర 7వ వార్డులో సబ్సిడీ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, వార్డు ఇంచార్జ్ అబ్దుల్ జాకీర్, 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జాజాల రాజగోపాల్, నిసార్, మజీద్, ఖయూమ్, వార్డు అధికారి నర్సింలు, మహిళలు అలాగే లబ్ది దారులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారు

Change News Type