జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన విజయసాయి సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్ కపిల్ మాట్లాడుతూ రచయిత పుప్పాల నవీన్ కుమార్ రచించిన “ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు” అనే పుస్తకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ చదవాలని, విద్యార్థుల కొరకు రచించిన పుస్తకమని అన్నారు. ఈ పుస్తకం ద్వారా విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.