viswatelangana.com
Date of Publish : 29 April 2025, 4:03 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఎల్లమ్మ ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అరవన్నంతో నైవేద్యం సమర్పించారు. భక్తులు 50 రూపాయల నోట్లను మాలగా చేసి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన్న కిష్ఠయ్య, ఉపాధ్యక్షులు తిరుపతి, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి బత్తిని శ్రీనివాస్, సభ్యులు మహేష్, అంజయ్య, రవి, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Change News Type