కథలాపూర్
ఎల్ ఓ సి మంజూరు చేపించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

viswatelangana.com
June 29th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 80,000/- రూపాయలు మంజూరు చేపించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కుటుంబ సభ్యులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆకుల సంతోష్ తిగల నరేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు



