కథలాపూర్

కథలాపూర్ లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

viswatelangana.com

December 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు భారత పౌరుడు కాదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో.. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజయం సాధించారని నాయకులు టపాసులు కాల్చారు. బస్టాండ్ వద్ద ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. న్యాయం గెలిచిందంటూ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

Back to top button