viswatelangana.com
Date of Publish : 15 May 2024, 4:21 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కరీంనగర్ లో ఎంపీ గా గెలుస్తున్నా -బండి సంజయ్ కుమార్

కరీంనగర్ లో తన గెలుపు ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని ఈ రెండు పార్టీలు ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంటాయన్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో చూపారని విమర్శించారు.

Change News Type