viswatelangana.com
Date of Publish : 03 March 2025, 2:08 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది
featured

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాయికల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ మరియు మండల & పట్టణ కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి . వీరి ఆధ్వర్యంలో మూటపెల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ ఎన్నుకోవడం జరిగింది.గ్రామ శాఖ సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా అలుపట్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా అరుగుల దామోదర్, పూదరి వేణు, ప్రధాన కార్యదర్శిగా సండ అంజయ్య, యువజన విభాగం అధ్యక్షుడిగా గుమ్మల నాగరాజు , ఉపాధ్యక్షులుగా బెక్కం రాజేష్, సురకంటి రాజేశ్వర్ రేడ్డి, ప్రధాన కార్యదర్శిగా తొగరి లక్ష్మీ నర్సయ్య ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి ,రానున్న స్థానిక సంస్థల ఎలక్షలల్లో మన పార్టీ అభ్యర్ధుల గెలిపే లక్ష్యంగా పని చేయాలని , కష్టపడే కార్యకర్తలకు పార్టీ అండగా వుంటుందని, రానున్న భవిష్యత్ లో పార్టీ అధికారంలోకి రావడం కాయమని వారు అన్నారు. ఈ కార్యక్రమలో మండల సమన్వయ కమిటీ సభ్యులు కొల్లూరి వేణు, కంటే గంగారం, నాయకులు ప్రశాంత్ రావు,పవన్ ,ఆరె బుచ్చన్న, నాగరాజు, సురేష్, గుండ నాగరాజు, క్రిష్ణ, షకిల్, రాజేష్, అజయ్, వంశీ, రఘు , మోక్సద్, వినిత్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type