viswatelangana.com
Date of Publish : 27 April 2024, 4:35 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కాంగ్రెస్ పార్టీలో చేరికలు

భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో హాజరైన రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్, వేములవాడ ఎంఎల్ఏ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లో బి ఎస్ పి మండల అధ్యక్షులు ఏర్రల రాజేష్ చేరినట్లు తెలిపారు. వారితో పాటు అధిక సంఖ్యలో యువకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరినట్లు తెలపడం జరిగింది. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ యొక్క విధివిధానాలు నచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ కొరకు అదేవిధంగా ప్రజల యోగక్షేమాల కొరకు అహర్నిశం పార్టీతో, సీనియర్ నాయకులతో కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తామని గెలుపడం జరిగింది.

Change News Type