viswatelangana.com
Date of Publish : 01 April 2024, 1:55 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కాంగ్రెస్ లో చేరిన పలువురు కథలాపూర్ మండల నాయకులు

వేములవాడ నియోజకవర్గ కేంద్రం లో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెవైయం అధ్యక్షుడు తోకల వినోద్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ బద్ధం మహిపాల్ రెడ్డి దేశవేని ధర్మేంధర్, పానుగంటి రాజు లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, రాష్ట్ర కాంగ్రెస్ ఫిషర్మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్ ఊరుమడ్ల కృష్ణ, పంజల మారుతి చారి ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్, మ్యాదరవేని రాజు తదితరులు పాల్గొన్నారు

Change News Type