viswatelangana.com
Date of Publish : 26 October 2024, 4:41 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం

ఆదివాసీ గిరిజన గ్రామమైన జగన్నాథ్ పూర్ గ్రామంలో ప్రభుత్వ వైద్యుల చే ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. దాదాపు 85మంది అనారోగ్యంతో భాధ పడుతుండగా వారికి రక్త పరీక్షలు నిర్వహించి, వారికి వైద్యులు మందులు ఇవ్వడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ నాయకుడైన పరాచ శంకర్ వైద్యులను సంప్రదించగా వెంటనే స్పంధిoచి ఉచిత వైద్య శిభిరం నిర్వహించి నందుకు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. సతీష్ కుమార్, హెచ్. ఇ. ఓ. సాగర్ రావు, సూపర్ వైజర్ శ్రీనివాస్, యల్. టీ. రాజమని, యమ్. యల్. హెచ్. పి. ఝాన్సీ, ఏ.ఎన్. ఎమ్. పుష్పలత, ఆశ. వర్కర్ సింధూజ, అంగన్వాడీ టీచర్ ప్రభావతి, మాజీ సర్పంచ్ ఆత్రం భగవంత్ రావు, పటేల్, సుధాకర్, కాంగ్రేస్ పార్టీ నాయకులు పరాచ శంకర్, మారుతి, రాజు, భీర్షా, సిడం. భీమ్, సూర్య, నగేష్, తదితరులు పాల్గొన్నారు.

Change News Type