viswatelangana.com
Date of Publish : 26 April 2024, 4:23 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు
featured

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పూజ చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలని కోరారు. మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ఆడెపు మధు, ఎంఏ.నయీమ్, మ్యాకల నర్సయ్య, గుర్రాల ప్రవీణ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు .

Change News Type