కథలాపూర్
ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ
viswatelangana.com
February 10th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలో ఫిబ్రవరి 12 న ఉదయం 10 గంటలకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన భూమిపూజ నిర్వహించనున్నట్లు పూలే అంబేద్కర్ జ్ఞాన వేదిక వ్యవస్థాపకులు సామాజిక తెలంగాణ ధూంధాం రాష్ట్ర అధ్యక్షులు మారంపెల్లి రవీందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బత్తుల నరేష్, లక్ష్మిరాజం, రమేష్, గంగాధర్, శ్రీధర్, ప్రదీప్, రంజిత్, శనిగా రపు గణేష్, అంబటి రవి, మారంపెల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు.



