కోరుట్ల

జువ్వాడి భవన్లో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు…

రాజశేఖర్ రెడ్డి తో ప్రత్యేక అనుబంధం ఉండేది జువ్వాడి

viswatelangana.com

September 2nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ జువ్వాడి భవన్ లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించారు. ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ… మహానేత పేదల పెన్నిధి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. వారు నిరంతరం పేద ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచించే వారన్నారు. అలాంటి మహానీయుని కోల్పోవడం తెలుగు ప్రజలకు బాధాకరమైన విషయం అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు వారి పనితనంతో యావత్ భారతదేశం చూపు తనవైపు చూసేలా చేశారన్నారు. జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల, రైతుల కష్టాలను చూసి చలించిపోయారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయితీగా నిబద్ధతతో కృషిచేసిన వ్యక్తి వైఎస్సార్ అని అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కల అనుకుంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేశారన్నారు. ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతీపుత్రులకు ఫీజు రియంబర్స్మెంట్ వరం కల్పించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందన్నారు. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం పండు టాకులకు పింఛను ఇచ్చి వారి ఆకలి తీర్చారు. తినే అన్నం మెతుకుల్లో ఆయన కట్టించిన ఇందిర ఇండ్లు, తమకు పునర్జన్మ ప్రసాదించిన రాజశేఖర్ అని తలుచుకొని నేటికీ కన్నీరు పెడుతున్నారని, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. దేశానికి వెన్నుముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ జలయజ్ఞం ఆరంభించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. రైతు రుణాలు మాఫీ చేసి లక్షల రైతు కుటుంబాలు వెలుగులు నింపారు. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 మే నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్సార్ రెండు రూపాయలకే కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్, సరస్వతి ట్రిపుల్ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇలా తన ప్రజా రంజక పాలనతో ప్రత్యేక స్థానం సంపాదించారన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంఏ నయీమ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఎలేటి మైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, జిందం లక్ష్మీనారాయణ, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ సోగ్రాభి, శ్రీరాముల అమరేందర్, నేమూరి భూమయ్య, చిట్యాల లక్ష్మీనారాయణ, ఏ.ఆర్ అక్బర్, సదుల వెంకటస్వామి చిలివేరి విజయ్ తెడ్డు విజయ్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button