viswatelangana.com
Date of Publish : 20 April 2024, 2:08 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గండి హన్మండ్లు, ఓబులాపూర్ చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ వినోద్ కుమార్

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లపూర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గండి హన్మండ్లు,ఓబులాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్ పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని, జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బోర్డర్ చెక్ పోస్టులను పకడ్బందీగా 24×7 వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లాలోనికి అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్య వేక్షణలో చెక్ పోస్టు లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.

Change News Type