viswatelangana.com
Date of Publish : 28 September 2024, 1:09 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గడి విద్యార్థులచే పన్నెండు వేల మొక్కల పెంపకం బాల్స్ తయారు

ప్రాథమిక పాఠశాల గడి కోరుట్ల పాఠశాల విద్యార్థులచే మట్టితో మొక్కల పెంపకం ఎలా అనే కార్య్రమాన్ని వాసవి వనిత క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో పన్నెండు వేల మొక్కలు మట్టి , మొక్కల విత్తనాలు వేప, సడుగులు, చింత, జమ, నెరవండ్లు, మోసంబి, తదితర గింజలు కలిపి విద్యార్థులచే తయారు చేసారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు అధ్యక్షతన నిర్వహించగా, ఈ కార్యక్రమంలో కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్, దారిశెట్టి రాజేష్, వనిత క్లబ్ అధ్యక్షురాలు భూస మాధురి, భాగ్య లక్ష్మి, మధురిమ, నిలి లక్ష్మి, శ్రీపతి వాని, మంచర్ల రోజా రాణి, మంచర్ల జగన్, మనుక రాజేంద్ర ప్రసాద్, చిద్రాల అశోక్, కొత్త సునీల్, నేతి శ్రీకాంత్, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.

Change News Type