జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షునిగా ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షునిగా పోన్నం శ్రీకాంత్ గౌడ్, కోశాధికారిగా బండి ప్రవీణ్ గౌడ్ ఆదివారం జరిగిన ఎలక్షన్స్ లో ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు మొగిలి పాక మహేష్, కైరంస్వామి, పెగ్గర్ల నారాయణ, వల్ల కొండ మహేష్, గుర్రం నరేష్, బి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.