viswatelangana.com
Date of Publish : 21 June 2025, 1:08 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఘనంగా స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కెట్ ప్రాంగణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమృత్ 2.0 వందరోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వివిధ పిండి వంటకాలను ప్రదర్శించారు. కొంతమంది ఆ పిండి వంటకాలను కొన్నారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మెప్మా టిఎంసి శరణ్య, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type