viswatelangana.com
Date of Publish : 02 July 2024, 1:15 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జిల్లాస్థాయిలో ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన సన్రైజ్ పోరుముల్ల విద్యార్థులు

ఆదివారం మెట్ పల్లిలోని మినిస్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలలో ఉత్తమ ప్రతిభకనబర్చిన సన్రైజ్ విద్యార్థులు యు 8 బాలుర విభాగంలో కాలగిరి రిత్విక్ స్టాడింగ్ బ్రిడ్ంప్ ప్రధమస్థానం 50 మీ. పరుగుపందెంలో ప్రథమస్థానం సాదించాడు. 0-10 బాలికల విభాగంలో సమ్మెట శ్రీనిధి లాంగ్ జంప్ లో ప్రథమస్థానం. యు -10 బాలికల విభాగంలో పల్లెపు. బి సీత 100మీ. పరుగుపందెంలో ప్రథమస్థానం సాధించటం జరిగింది. ఉత్తమ ప్రతిభతో రాష్ట్ర స్థాయి ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ బి. ఎడ్వర్డ్ జోయల్, వైస్ ప్రిన్సిపాల్ మల్లేశం, పిఈటి, గ్రామ మాజీ సర్పంచ్ లేటి తిరుపతి రెడ్డి పిల్లలను, యాజమాన్నాని ఇందుకు కృషి చేసిన పిఈటిని అభినందించారు.

Change News Type