జగిత్యాల జిల్లా రాయికల్ మండల తహసిల్దార్ కార్యాలయములో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి తహసిల్దార్ యం.ఎ. ఖయ్యుం, నాయబ్ తహసిల్దార్ జే.గణేష్, సీనియర్ సహాయకులు బి.రమేష్, గిర్దావరులు దేవదాస్, పద్మయ్య మరియు కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.