జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మూడవ వార్డులో కచ్చ డ్రైనేజీ ఉండుట వలన మురుగు నీరు ప్రవహించక దోమలు, మురుగు వాసనతో కాలనీ వాసులందరికీ చాలా ఇబ్బందికరంగా ఉన్నందున, నూతన డ్రైనేజీ సౌకర్యం కల్పించగలరని, తాగునీటి సౌకర్యం పైపులైను వేయగలరని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొట్టూరి వెంకటరవీందర్, డి.గోపి, ఏ. వంశీధర్ రెడ్డి, ఎం.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.