viswatelangana.com
Date of Publish : 22 February 2025, 2:51 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
దేవాలయాలను దర్శించుకున్న గీత విద్యాలయం విద్యార్థులు

జగిత్యాల జిల్లా వాణి నగర్, గీతా విద్యాలయంలో చదువుతున్న చిన్నారులు శనివారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను, రాయికల్ పట్టణంలో కొలువైన పంచముఖ లింగేశ్వర స్వామిని (గుడికోట) దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పంచముఖ లింగేశ్వర దేవస్థాన చైర్మన్ మచ్చ శ్రీధర్ చిన్నారులకు ప్రత్యేక దర్శనం కల్పించి పూజలు నిర్వహించి, అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గీతావిద్యాలయం మాతాజీలు, ఆచార్యులు విద్యార్థులు దేవాలయ చైర్మన్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

Change News Type