కోరుట్ల

నలంద స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు

ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు నలంద స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు

viswatelangana.com

February 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ ఆదర్శనగర్ నలంద హైస్కూల్లో గురువారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి విద్యార్థిని, విద్యార్థులు తయారుచేసిన విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను నివేదికలను ప్రదర్శన బోర్డులను తిలకించి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు చాలా చక్కగా వారి ప్రతిభను కనబరచడం జరిగిందని, ఇలాంటి సైన్స్ ఫెయిర్ ల వల్ల విద్యార్థులను సృజనాత్మకతను బయటకు తీయవచ్చునని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన విషయం పరిశోధన సమయంలో విద్యార్థులు కృషి చేసిన అంశాలను కలిగి ఉంటుంది ఇది పరిశోధనల పనుల పరిధిని ఒక ప్రయోగంలో జరిగిన సంఘటన వివరాలను చూపుతోందన్నారు. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన నలంద పాఠశాల యజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోరుట్ల పట్టణ శివారు ప్రాంతాలు జగిత్యాల రోడ్డులో పాలిటెక్నిక్ కళాశాల మెట్పల్లి రోడ్డులో వెటర్నరీ కళాశాల ఉండడం కోరుట్ల పట్టణానికి తలమానికమన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మచ్చ కవిత, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, పేస్ చైర్మన్ ఎలిశెట్టి భూమారెడ్డి, నాయకులు పుప్పాల ప్రభాకర్, ఆడేపు మధు, శీలం వేణుగోపాల్, ఏంబేరి నాగభూషణం, కరుణాకర్ రావు, సైదు గంగాధర్, సోగ్రాభి, ఎడ్ల రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు రిజ్వన్ పాషా, జెట్టి చిట్యాల లక్ష్మీనారాయణ, తెడ్డు విజయ్, రాజు, తునికి సాయి, ఇంద్రాల హరీష్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు నలంద పాఠశాల నిర్వాహకులు నాగేంద్ర కుమార్, పద్మ, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button