నేడు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, సంజయ్ బాధ్యతలు బీజేపీ స్టేట్ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేబినెట్ హోదాలో బొగ్గు, గనులశాఖ మంత్రిగా నియమితులైన కిషన్రెడ్డి ఢిల్లీలోని శాస్త్రిభవన్ ఎ బ్లాక్లో ఉదయం 11 గంటలకు, హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉదయం 10.35 గంటలకు నార్త్ బ్లాక్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.