వ్యవసాయ అధికారిణి యోగిత మాట్లాడుతూ జిలుగు, జనుము వేసుకున్న రైతులు పూత దశలో నెలలో కలియ దున్నాలని, ఇది బాగా మురగడానికి సూపర్ పాస్పేట్ ఒక ఎకరానికి 100 కేజీ బస్తాలు వేసుకుని వారం నుండి 10 రోజులు పొలానికి నీరు పెట్టినట్లయితే ఆ పచ్చిరొట్ట బాగా మురిగి పొలానికి సేంద్రియ ఎరువును అందిస్తుంది. సేంద్రియ కర్బనం పెరిగి పంట దిగుబడి పెరగడంతో పాటు యూరియా మిగులుతుందని అన్నారు.