viswatelangana.com
Date of Publish : 15 March 2024, 4:59 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేసిన పూర్వ విద్యార్థులు

భీమారం మండల కేంద్రంలోని భీమారం ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే సోమవారం నుండి జరగబోయే పబ్లిక్ పరీక్షలకు అదే పాఠశాలలో చదువుకున్న 2018-19 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులను అందజేశారు. పదవ తరగతి హాల్ టికెట్లను, పరీక్ష సామాగ్రిని పాఠశాలలోని సరస్వతి మాత ముందు ఉంచి సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2018 -19 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది. అలాగే పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేస్తూ పరీక్ష రాసే విధానంపై సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Change News Type