viswatelangana.com
Date of Publish : 23 September 2024, 3:25 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరిచిన ఆటో డ్రైవర్స్

కోరుట్ల పట్టణ మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆటో యూనియన్ సంఘంలోని 50 మంది సభ్యులు టాయిలెట్ పరిసర ప్రాంతలను శుభ్రం చేసారు. ఈ క్యాంపియన్ లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలు అలాగే పరిసర ప్రాంతాల నుంచి కోరుట్ల పట్టణానికి వచ్చే ప్రజలు పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకుని, కోరుట్ల పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా మార్చడం కొరకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, ఆటో యూనియన్ సంఘ సభ్యులు అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Change News Type