viswatelangana.com
Date of Publish : 24 September 2024, 4:29 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పరిసరాలను పరిశుభ్రం చేసిన యువకులు

మునిసిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవకార్యక్రమంలో భాగంగా ఐలాపూర్ రోడ్ యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి మున్సిపల్ కమిషనర్ తో కలిసి పలు ప్రదేశాలను శుభ్రపరచారు. ఈ కార్యక్రమంలో దాదాపు 80 మంది యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ… పట్టణంలోని యువకులు మరియు స్వచ్ఛంద సేవ సంఘాలు, స్వచ్చత హి సేవ కార్యక్రమంలో పాల్గొని దీనిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, అయిలాపూర్ రోడ్ యువత మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Change News Type