viswatelangana.com
Date of Publish : 07 May 2024, 2:48 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపతిపూర్ లో 2008-09 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో తమ చిన్ననాటి పాఠశాల గుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు, తదనంతరం తమకు విద్యను అందించిన గురువులను ఘనంగా సన్మానించారు. అప్పటి ఉపాధ్యాయులు తమ విద్యార్థుల అనుబంధాలను గుర్తుచేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోటేశ్వర్ రావు, చీటి భూపతిరావు, జక్కుల రాజేంద్రప్రసాద్, కట్కం మధు, సంజన, బందేల తిరుపతి, తాజమాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నావేని వేణు, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Change News Type