viswatelangana.com
Date of Publish : 08 July 2024, 4:35 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పోసానిపేట కు సబ్ స్టేషన్ మంజూరు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట్ – దుంపేట గ్రామాల వినియోగదారులకు లోడ్లు పెరగడం, రోజురోజుకు డిమాండ్ మరియు లోడ్లు రోజురోజుకు పెరుగుతున్నందున సుదీర్ఘమైన లోడెడ్ ఫీడర్ల వల్ల ఎక్కువ సంఖ్యలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని క్షేత్రం నుండి నివేదించబడింది. ఈ మేరకు పోసానిపేట్ వద్ద 33/11 కెవి సబ్-స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన, తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. రూ. 2,20,57,000/- (రూ. రెండు కోట్ల ఇరవై లక్షల యాభై ఎవడు వేల రూపాయలతో పోసానిపేటలో 33/11కెవి సబ్‌స్టేషన్‌ను నిర్మించాలనే పై ప్రతిపాదనకుసబ్ స్టేషన్ మంజూరు చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపిటీసి కాయితి నాగరాజు, మాజీ సర్పంచ్ ఎంజీ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బత్తుల అశోక్ మరియు గ్రామ ప్రజలు విద్యుత్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Change News Type