అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులచే యోగాసనాలు ప్రాణయామం సూర్య నమస్కారాలు మెడిటేషన్ చేయించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ యోగా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని మానసికమైన ఉల్లాసం కలుగుతుందని ప్రతిరోజు యోగా చేయాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు