viswatelangana.com
Date of Publish : 17 March 2024, 4:29 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే లక్ష్యంగా ఉద్యమిద్దాం

ప్రజాస్వామ్య విలువలు లౌకిక సూత్రాలకు కట్టుబడి శాంతి సామరస్యం సమానత్వాన్ని కాపాడటానికి ఆవిర్భవించిన పౌర సమాజ సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అని భావ సారూప్యత కలిగిన మేధావులు ప్రజాస్వామ్య వాదులు కలిసి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఉద్యమిద్దామని సమితి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి పిలుపునిచ్చారు. ఆదివారం సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డాక్టర్ సూరి మాట్లాడుతూ కుల మత భాషల పరంగా విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లకు ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మన సమాజ భవిష్యత్తును కాపాడుతూ నవ సమాజ నిర్మాణానికి దోహదపడలన్నారు.

Change News Type