viswatelangana.com
Date of Publish : 13 September 2024, 2:57 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రతి స్త్రీ అమ్మవారి శక్తి స్వరూపము

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గుడేటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పంతులు శివశంకర శర్మ ప్రత్యేక పూజలు, మహిళలచే కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శివ శర్మ మాట్లాడుతూ ప్రతి స్త్రీ అమ్మవారి శక్తి స్వరూపమని, మహిళలు పూజ చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుందని అన్నారు.. అనంతరం భక్తులకు, మహిళలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడేటి రెడ్డి సంఘం అధ్యక్షులు గడ్డం అంజిరెడ్డి, కోశాధికారి ఏలేటి రవీందర్ రెడ్డి, కార్యదర్శి బద్దం రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎలేటి నరసింహారెడ్డి, సలహాదారులు, ఎడమల విజయ్ రెడ్డి, సోమనారాయణ రెడ్డి, సంఘ సభ్యులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type