viswatelangana.com
Date of Publish : 05 September 2024, 12:26 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లిలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి విద్యార్థి జీవితంలో గురువు స్థానము వెలకట్టలేనిదని, చీకటిని పారద్రోలి వెలుగును నింపే గురువులందరినీ సన్మానించుకునే, స్మరించుకునే కార్యక్రమమే ఈ ఉపాధ్యాయుల దినోత్సవం అని తెలియజేశారు .ఈ కార్యక్రమము అనంతరము కళాశాల అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్ మరియు అధ్యాపకులు సిహెచ్ . శ్రీనివాస్, జగపతి,శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య, సుదర్శన్, ప్రతిభ మంజుల, కిరణ్ కుమార్, జాకీర్, నవీన్ కుమార్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type